ఆమె చావుకి కారణం ఉప్పే.. శ్రీ‌దేవీ చావులో మిస్టరీ కనిపెట్టిన డాక్టర్లు..!!

సినీ ఇండస్ట్రీలో మెలగాలంటే అందం, అదృష్టంతో పాటు బాడీ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు ఫిట్నెస్ కోసం డైట్ ఫాలో అవుతుంటారు. ఈ కారణంగా కొంతమంది మృత్యువాత పడుతున్నారు. అయితే.. శ్రీదేవి కూడా ఈ విధంగా చేసే మనకు దూరం అయ్యారు అంటున్నారు ఆమె మరణాన్ని దగ్గర నుంచి చూసిన కొందరు డాక్టర్లు.

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోని కపూర్ కూడా ” శ్రీదేవికి లోబీపీ ఉందని.. ప్రమాదవసాత్తు బాత్ టబ్లో పడిపోయిన మరణించిందని ” చెప్పుకొచ్చారు. ఇక దీంతో డాక్టర్లు కూడా.. శ్రీదేవి మరణం గురించి చెప్తూ అందం గురించి డైట్ చేసే వాళ్లను హెచ్చరించారు. డైట్ పేరుతో చాలామంది నటీనటులు రుచి పచీలేని ఫుడ్లు తింటున్నారు. ఒకవేళ డైట్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా అందులో ఉప్పును అసలే మిస్ చేయొద్దని చెబుతున్నారు. ఎందుకంటే హ్యూమన్ బాడీకి కొన్ని లక్షణాలు అవసరం.

ఉప్పులో ఉండే సోడియం లవణం బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. సెల్యులార్ ఫంక్షన్స్ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందుకే WHo కూడా మనిషి ప్రతి రోజు మినిమం 5 గ్రాముల ఉప్పును ఫుడ్ తో పాటు తీసుకోవాలని లేదంటే.. బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అంటున్నారు. దీని కారణంగా బీపీకీ గురై కళ్ళు తిరగడం కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.