ప్రశాంత్ కోసం శివాజీ.. సందీప్ కోసం అమర్‌దీప్‌.. ఫుల్ ఎమోషనల్‌గా సాగిన బిగ్‌బాస్ 7..!!

ఈ ఏడాది బిగ్ బాస్ చూస్తున్నవారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మొదటివారం నుంచి నామినేషన్స్, ఎలిమినేషన్స్ తో హీటెక్కిస్తున్నారు. నాలుగు వారాలుగా హాట్ హాట్ గా సాగిన బిగ్ బాస్… ఐదో వారంలో మాత్రం ఎమోషనల్ ట్రాక్ ఇచ్చాడు. తాజాగా విడుదలైన ఎపిసోడ్ చూస్తే హౌస్ లోని కంటెస్టెంట్లకి.. తమ కుటుంబ సభ్యుల పట్ల బావుద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది. అందులోని సీన్స్ ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికి అందించారు.

కానీ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంట్లో ఉన్న వారంతా జోడి కట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అలా ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే.. మరొకరికి మాత్రమే ఉత్తరం చదువుకునే అవకాశం ఉంది. అయితే ఎవరో ఒకరు తమ ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఎమోషనల్ సీన్ కనిపించాయి. అయితే ఈ ఎపిసోడ్‌లో అమర్దీప్ తన భార్యను తలుచుకుని కంటతడి పెట్టాడు. అమర్ మాట్లాడుతూ.. ఇంతవరకు తేజు ని బాగా చూసుకున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసి వచ్చాయి.

కన్నాను చూడగానే అది పిలిచినట్లు అనిపించింది. తేజు ఐ యామ్ సో సారి నీ విలువ తెలిసింది నాకు అంటూ బోరున ఏడ్చేసాడు. ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లేఖను త్యాగం చేశాడు అమర్. ఇక శివాజీ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషన్స్ తో హౌస్ నిండిపోయింది. శివాజీ మాట్లాడుతూ..” ఎక్కడో ఊరి నుంచి వచ్చావు.. అన్న అంటూ హగ్ చేసుకున్నావ్.. నేను నా లెటర్ ను గివప్ చేస్తున్నా. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటుంది.

తనను నేను ఎంత బాగా అర్థం చేసుకున్నాను నాకు తెలియదు కానీ.. తను మాత్రం నన్ను బాగా అర్థం చేసుకుంది. నువ్వు నా మాట విను ” అంటూ పల్లవి ప్రశాంత్ కోసం తన భార్య పంపించిన లెటర్ ను త్యాగం చేశాడు శివాజీ. అనంతరం రంగుపడుద్ది అనే క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారు. అందులో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. మొదటి కెప్టెన్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు.