షారుక్ – రవితేజ కాంబోలో మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. కొత్త దర్శకుడు వంశీ తర్కెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్టువర్ట్పురం గజదొంగ అయినా టైగర్ నాగేశ్వరరావు నిజ జీవితాన్ని బయోపిక్‌గా ఈమూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ మూవీ కావడంతో ప్రమోషన్స్ కోసం ప్రపంచమంతా చుట్టేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ వంశీ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూలో రిపోర్టర్ మల్టీస్టారర్ చేయాలని ఉంటే ఎవరితో తీస్తారు అని డైరెక్టర్ ను ప్రశ్నించగా దానికి వంశి స్పందిస్తూ నాకు షారుక్ అంటే చాలా ఇష్టం ఆయన సినిమాలన్నీ నేను చూస్తూనే ఉంటా నాకున్న కోరిక ఏంటంటే షారుక్ – రవితేజ కాంబినేషన్లో మల్టీ స్టార‌ర్ చేయాలి. ఎప్పటికైనా ఆ సినిమాను తెరకెక్కిస్తా అంటూ వివరించాడు.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్‌ అవుతుంది. వంశీ చెప్పినట్లు వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ లో ఉండడం ఖాయం అంటూ ఫ్యాన్స్ తో పాటు నటిజెన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిషేక అగర్వాల్ ప్రొడ్యూసర్ గా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. నూపూర్ స‌న‌న్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.