ఎలిమినేషన్ పై తొలిసారి స్పందించిన రతిక.. వాళ్లు నమ్మకద్రోహం చేశారంటూ..

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న కంటెస్టెంట్లలో రతిక ఒకటి. ఈ బ్యూటీ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఎంతో యాక్టివ్ గా మాట్లాడుతూ.. ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కానీ కొన్ని లక్షల మంది చూస్తున్న జడ్జిమెంట్ ప్రోగ్రామ్లో ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోలేక పోయింది.

కాగా నాలుగో వారంలోనే రతిక ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రతిక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మొదటిసారి సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో ” డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్స్ “.. బిగ్ బాస్ హౌస్ లో చూసిన దానికంటే మీకు తెలియాల్సినది ఇంకా చాలా ఉంది అని రతిక రాసుకొచ్చింది.

దీనిబట్టి చూసుకుంటే బిగ్ బాస్ తన ఎలిమినేషన్ విషయంలో తనకు అన్యాయం చేశారని ఈ సందర్భంగా ఈమె చెప్పకనే చెప్పింది. ఇక హౌస్ లో తను ఉండగా తనకి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ఈ సందర్భంగా ఈ బ్యూటీ కృతజ్ఞతలు తెలియజేసింది.