టాలీవుడ్ లో అత్యధికమైన రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకడు. ప్రస్తుతం మహేష్ త్రివేక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుతా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగ గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి కాంబినేషన్లో మహేష్ మరో సినిమాను తరికెక్కించబోతున్నాడు.
పాన్ ఇండియా లెవెల్ లో సోషియా ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. గ్లోబల్ లెవెల్లో ఈ సినిమాపై హైప్ నెలకొంది. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు భారీ రెమ్యనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ ఏకంగా రూ.110 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక మహేష్ సినిమా సినిమాకు తన పారితోషికాన్ని పెంచుతూ వెళ్తున్నాడు ప్రస్తుతం గుంటూరు కారం మూవీకి రూ.78 కోట్ల తీసుకుంటున్న సూపర్ స్టార్ ఏకంగా రూ.100 కోట్లు మార్క్ దాటేశాడు. మహేష్ సర్కార్ వారి పాట కోసం రూ.50 కోట్లు అందుకోగా అంతకుముందు సరిలేరు నీకెవరు సినిమా కోసం రూ.40 కోట్లను పుచ్చుకున్నారు.