” గుంటూరు కారం ” మూవీపై నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కునున్న లేటెస్ట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక హాసిన్‌ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మ్యాడ్ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్. నాగవంశీ మాట్లాడుతూ..” తాము ముందుగా వెల్లడించినట్లే పక్కాగా జనవరి 12న గుంటూరు కారం మూవీ థియేటర్స్ లో ఉంటుందని అన్నారు.

అలానే మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని దసరా కంటే ముందే రిలీజ్ చేస్తాం అని.. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చాలా రోజుల తర్వాత ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అలాగే సంక్రాంతికి మహేష్ బాబు ఫ్యాన్స్ గుంటూరు కారంతో సినిమాతో పెద్దఎత్తున పండగ చేసుకోవడం ఖాయమని తెలిపాడు”. నాగవంశీ క్లారిటీతో గుంటూరు కారం రిలీజ్ రూమర్స్ పై చెక్ పడడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.