పిల్లల కోసం ఒకటైన స్టార్ జంట.. గ్రేట్ అంటున్న అభిమానులు..!!

కోలీవుడ్ స్టార్ జంట ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుని విడిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి విడాకుల విషయం తెలిసి ధనుష్, రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఫీల్ అయ్యారు. అంతేకాకుండా రజినీకాంత్ కూడా కూతురి వివాహ జీవితం ఇలా అయిందని డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపించాయి. అయితే వీరి విడాకుల అనంతరం మళ్లీ ఈ ఇద్దరు కలిసిపోతున్నట్లు అనేక వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలోని ధనుష్, ఐశ్వర్యల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. వీళ్ళిద్దరూ కలిసిపోయారని మళ్ళీ నెట్టింట టాక్‌ నడుస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే వారు విడిగా ఉంటున్నారు కానీ విడాకులు తీసుకున్నట్లు ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ధనుష్, రజినీకాంత్ ఫ్యాన్స్ వీళ్లు మళ్లీ కలిసే ఉంటారు అని ధీమాగా చెబుతున్నారు.

కానీ వీళ్ళిద్దరూ మళ్లీ భార్యాభర్తలుగా కలిసి ఉండే ప్రసక్తే లేదంటూ కొన్ని వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఏది ఏమైనా ఇద్దరు భార్యాభర్తలుగా దూరంగా ఉన్నప్పటికీ.. తమ పిల్లలకు తల్లిదండ్రులుగా ప్రతి విషయంలో కలిసే ఉండటం గ్రేట్ అంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.