తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ దేవర. ఈ సినిమా సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఎంతో ప్రతిష్టాత్మకంగా తర్కెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు ఆసక్తికర న్యూస్ వైరల్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటిస్తున్న మొదటి సినిమా కావడం, అది కూడా కొరటాల శివ – ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అండర్ వాటర్ ఫైట్ సీన్స్ కూడా ఈ సినిమాలో భారీగా ప్లాన్ చేశారట. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో నట్టిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ లాంటిది ఏది బయటకు రాకముందే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ సినిమా గురించి వైరల్ అవుతుంది. దేవర సినిమాను రెండు పార్ట్లుగా రిలీజ్ చేయబోతున్నట్టు దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు.
మొదటి పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుండగా సినిమాలో పోస్టల్ కు సంబంధించిన సీన్ల షూటింగ్ పూర్తయిందని వివరించాడు. దానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు కొరటాల. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా దేవరా ను రెండు పార్టీలుగా రిలీజ్ చేస్తున్నారా అంటూ షాక్ అవుతున్నారు.
#DEVARA will be coming to entertain you in 2 parts.
The first part is releasing on April 5, 2024. pic.twitter.com/x88jgGS9QI
— Devara (@DevaraMovie) October 4, 2023