క‌నీసం న‌టిగా కూడా న‌న్ను గుర్తించ‌లేదు.. ఏం సాధించావ్ అంటూ టార్చ‌ర్ పెట్టేది: నిత్యా మీన‌న్

సౌత్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యా మీన‌న్ ఒక‌టి. కెరీర్ ఆరంభం నుంచి ఎక్స్‌పోజింగ్ కు దూరంగా ఉంటూ కేవ‌లం న‌ట‌నా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న నిత్యా మీన‌న్‌.. తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఇప్ప‌టికీ త‌న కెరీర్ ను స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తోంది.

రీసెంట్ గా `కుమారి శ్రీ‌మ‌తి` మూవీతో ప‌ల‌క‌రించి హిట్ అందుకుంది. ఫ‌న్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇందులో ముప్పై ఏళ్లు వ‌చ్చినా పెళ్లి చేసుకోవ‌డానికి ఇంట్రెస్ట్ చూప‌ని అమ్మాయి పాత్ర‌లో నిత్యా మీన‌న్ అద్భుతంగా ఆక‌ట్టుకుంది. అయితే కుమారి శ్రీ‌మ‌తి స‌క్సెస్ తో నిత్యా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా పెళ్లి గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

`నా పేరెంట్స్ నాకు ఫుల్ ఫీడ్ర‌మ్ ఇచ్చారు. పెళ్లి విష‌యంలోనూ ఎప్పుడూ వారు నాపై ఒత్తిడి పెట్ట‌లేదు. చాలా స‌పోర్టివ్ గా ఉండేవారు. కానీ, మా బామ్మ మాత్రం బ‌తికున్న‌ప్పుడు పెళ్లి విష‌యంలో న‌న్ను బాగా టార్చ‌ర్ పెట్టేది. క‌నీసం న‌టిగా కూడా న‌న్ను గుర్తించేది కాదు. నువ్వు ఏం చేస్తున్నావ్‌..? జీవితంలో ఏం సాధించావ్‌..? పెళ్లి చేసుకోవ‌చ్చు క‌దా..? అంటూ త‌ర‌చూ అడిగేది. ఆమె త‌ప్పితే మ‌రెవ‌రూ న‌న్ను మ్యారేజ్ విష‌యంలో ఫోర్స్ చేయ‌లేదు` అంటూ నిత్యా మీన‌న్ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.