లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏమే వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మంచి క్రేజ్తో కొనసాగుతుంది. ఇక ఇటీవల బాలీవుడ్ లో జవాన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్లో తరికెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకొని.
రూ. 1,100 కోట్ల కలెక్షన్లు సాధించి కొత్త రికార్డును సృష్టించింది.ఈ సినిమాతో బాలీవుడ్తో పాటు పాన్ ఇండియా లెవల్లో మంచి పాపులారి దక్కించుకుంది నయంతార. ఈ నేపథ్యంలోనే నయన్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రణ్వీర్ సింగ్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ బైజు బావ్రా ‘ మూవీ లో నయన్ని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా సందడి చేయబోతుంది. ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది.