ఇండస్ట్రీ లోకి యాంకర్ గా అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన యంగ్ హీరో ఈ సినిమాలో తన నటన, కామెడీ టైమెంతో మంచి మార్కులను కొట్టేశాడు. తరువాత అనుదీప్ డైరెక్షన్లో జాతి రత్నాలు సినిమాలో నటించాడు. ఈ సినిమా ఊహించని విధంగా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి రూ.38 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. నవీన్ పోలిశెట్టి సినీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న నవీన్ మిస్శెటి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మన ముందుకు వచ్చాడు.
ఈ సినిమా కాస్త స్లోగా అనిపించినా మంచి టాక్ సంపాదించుకుంది. నవీన్ పోలీశెట్టి సెకండ్ హాఫ్ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. దీంతో యావరేజ్ అవ్వాల్సిన సినిమా సూపర్ హిట్ అయి నవీన్ కెరీర్ లో హ్యాట్రిక్ హిట్ పడింది. ఇక తర్వాత నవీన్ పోలిశెట్టి స్క్రిప్ట్స్ కలెక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే కళ్యాణ్ శంకర్ కాంబినేషన్లో ప్రారంభించిన అనగనగా ఒక రాజు సినిమాని హోల్డ్లో పెట్టాడట. ఇక కళ్యాణ్ శంకర్ రీసెంట్గా మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమాని మంచిగా తీశాడు.. కానీ నవీన్ పోలీశెట్టి సినిమాలో మాత్రం అవుట్పుట్ సరిగ్గా లేదట.. ఈ కారణం సినిమా అవుట్ ఫుట్ నవీన్కి పెద్దగా నచ్చక పోవడమేనని.. అందుకే ఈ సినిమా నుంచి కళ్యాణ్ శంకర్ను తప్పించి గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన జాతి రతనాలు డైరెక్టర్ అనుదీప్నే ఈ సినిమాకు పెట్టాల్సిందిగా నవీన్ పాలిసెట్టి నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నాడంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ పెట్టిన ఈ కండిషన్తో ప్రొడ్యూసర్కు పెద్ద ఇరకాటమే వచ్చి పడింది.