తల్లి, భార్య జోలికొస్తే ఇంటికొచ్చి మరీ కొడతా.. కామెంట్లపై ఫైర్ అయిన అమర్ తల్లి..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్‌అయి ఇప్పటికే ఆరు వారాలను పూర్తిచేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ గేమ్స్ లో ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేందుకు ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ టాస్కుల్లో త‌మ స‌త్తా చూపిస్తున్నారు. తోటి కంటెస్టెంట్లతో సఖ్యతగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు గొడవలు పడుతున్నారు. దీనికి తోడు కంటెస్టెంట్లు పిఆర్ టీమ్స్ దిగజారిపోయి. ఇతర కంటెస్టెంట్‌ల పై కామెంట్స్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా లాగుతున్నారు. తమ కంటిస్టంట్‌ల‌కు హైప్‌ ఇస్తూ ఓట్ల కోసం ప్రయత్నించడంలో తప్పులేదు.

కానీ అవతల వారిపై అనవసరంగా ట్రోలింగ్స్ కు దిగుతున్నారు. తాజాగా ఇదే విషయంపై అమర్దీప్ చౌదరి తల్లి మనస్థాపానికి గురి అయ్యారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు చెందిన పి ఆర్ టీం తమను మానసికంగా వేధిస్తుందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇదే విషయాన్ని నాగార్జునతో కలిసి మాట్లాడతానని అమర్దీప్ తల్లి కామెంట్ చేశారు. నేను అమర్ తల్లిని.. మీకు ఏమైనా మతుండే ఇలాంటి నీచమైన కామెంట్లు చేస్తున్నారా..? అసలు మీరేం తింటున్నారు..? గడ్డి తింటున్నారా..? పల్లవి ప్రశాంత్ ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా..? అమర్ భార్య గురించి ఇంతటి నిజమైన కామెంట్లు చేస్తున్నారు అసలు మీరు ఏం..? మాట్లాడుతున్నారు. పల్లవి ప్రశాంత్ పై ప్రేమ ఉంటే ఓట్లు వేసి గెలిపించండి అంటూ ఫైర్ అయింది.

కానీ తల్లి, భార్యల జోలికి వస్తే మాత్రం ఇంటికి వచ్చి మరీ కొడతాను మీకు అసలు సంస్కారం ఉందా. మీ మాటల వల్ల ఎదుటివారు ఎంత బాధ పడుతున్నారో..? ఒక్కసారి కూడా ఆలోచించరా..? మీ కామెంట్లకు మేము మానసికంగా చచ్చిపోతున్నాం. నాగార్జున దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి నేను మాట్లాడతా అంటూ అమర్దీప్ తల్లి కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని ప్రమోట్ చేసుకోవాలి గాని పక్క కాంటెస్ట్ లా కుటుంబ సభ్యులను ఇందులోకి లాగడం ఏంటి అంటూ నెట్టిజ‌న్‌లు ఫైర్ అవుతున్నారు.