తిరుమలేశుని సన్నిధిలో ” లియో ” టీం.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర క్రేజీ హైప్‌లో ఉన్న పలు సినిమాల్లో తమిళ్ అవైటెడ్ సినిమా ” లియో ” కూడా ఒకటి. విజయ్ హీరోగా లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా… తాజాగా ఈ చిత్ర యూనిట్ లోకేష్ తో పాటు సినిమా యూనిట్ కొందరు సభ్యులు సినిమా విజయం సాధించాలి అని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల సన్నిధిని చేరారు.

దీంతో అక్కడ విజువల్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా విజయ్ ద‌త్త్‌ మరియు యాక్షన్ కింగ్ అర్జున్ సార్జాలు ముఖ్యపాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం సమకూర్చాడు. మరి 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈనెల అక్టోబర్ 19న ప్రేక్షకులు ముందుకి రానుంది.

ఇక లోకేష్ కనగ‌రాజ్ ఇప్పటికే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లోకేష్‌ దర్శకత్వం వహించిన సినిమాల్లో కంటెంట్ బాగుంటుందని నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అలాగే కోలీవుడ్ ప్రేక్షకుల్లో విజయకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ సినిమాపై విజయ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.