విజయ్, పరుశురామ్‌ కాంబినేషన్‌పై లేటెస్ట్ అప్డేట్..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమా తో హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ సినిమాలు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ మంచి మార్కెట్‌తో కొనసాగుతున్నాడు. ఇటీవల డైరెక్టర్ పరుశురాంపేట్ల‌ తో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

గతంలో విజయ్ దేవరకొండ పరుశురామ్‌ కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం భారీ బ్లాక్ బాస్టర్ కావ‌టంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులు అంచనాలకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ తో కొనసాగుతుంది. అయితే సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మేకర్స్ మరోవారం గ్యాప్ తోనే ఈ సినిమా టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ ను ప్లాన్ చేస్తున్నారట దీంతోనే అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా అనౌన్స్ చేస్తారంటూ తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ లేదా గ్లింప్స్‌ను 16 – 19వ తారీఖు లోపుగా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక‌ మరోవారం గ్యాప్ లోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు పై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నారట ఈ మూవీ టీమ్‌.