సంచలన నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.. ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ అలాంటి పోస్ట్‌.. !!

ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన జగపతిబాబు ప్రస్తుతం విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరెక్ట్ ఆర్టిస్ట్‌గా ఆయన ఎంచుకుంటున్న పాత్రలు బలమైనవనిపిస్తేనే జగపతిబాబు నటిస్తున్నాడు. సినిమా ఏదైనా హీరో ఎవరైనా బలమైన పాత్రలు ఉంటే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచేస్తున్నాడు. హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాతే జగపతిబాబు క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. ఇక నటుడుగా ఫుల్ బిజీగా గడుపుతున్న జగపతిబాబు ఒక్కసారిగా వార్తల్లో వైర‌ల్ అవుతున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్ ఇస్తుంది.

ఇకపై అత‌డికి.. తన పేరుతో ఉన్న అభిమాన సంఘాలకు సంబంధం లేదని తెల్చిచెప్పేశాడు. ట్రస్ట్ కి కూడా తాను దూరం అవ్వబోతున్నట్లు వివరించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. ఇందులో జగపతిబాబు మాట్లాడుతూ 37 ఏళ్ళుగా నా కుటుంబం, శ్రేయోభిలాషులా.. నా అభిమానులు కూడా నా ఎదుగుదలకు కారణం అనుకున్నాను. అలాగే వాళ్ళు ప్రతి కుటుంబం విషయంలో పాల్గొని వాళ్ళ కష్టాల్ని నా కష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న.. నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులు అంటే అభిమానం, ప్రేమ ఇచ్చే అని మనస్పూర్తిగా నమ్మాను.

కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైంది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇకనుంచి నా అభిమానుల సంఘాలు, ట్రస్ట్‌ల‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటి నుంచి తప్పుకుంటున్నా. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అని వెల్లడించాడు. జగపతిబాబు జీవించండి.. జీవించనివ్వండి.. అంటూ ఆ పోస్టులో రాసుకోచ్చాడు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.