అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన సిద్దు జొన్నలగడ్డ…” డీజే టిల్లు ” సినిమాతో సూపర్ హిట్ అందుకుని యంగ్ హీరోలలో ఒకడిగా ఫేమస్ అయ్యాడు. ఇక ప్రజంట్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ” టిల్లు స్క్వేర్ ” అనే టైటిల్ తో సీక్వెల్ అనౌన్స్ చేశారు.
ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వీరిద్దరి జోడి ఎలా ఉంటుందో.. సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సిద్దు తన తదుపరి సినిమా గురించి కూడా అప్డేట్స్ ఇచ్చాడు. సిద్దు హీరోగా నీరజ కోన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈరోజు ” తెలుసు కదా ” అనే టైటిల్ను ప్రకటించడంతో పాటుగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఆయనకి జోడిగా శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లవ్ ట్రాక్ మాత్రమే కాదు, స్నేహం, త్యాగం, కుటుంబం ఇలాంటి అంశాలతో తెరకెక్కుతుందట. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.