మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చేయాలని ఉంది.. వెంకటేష్ కామెంట్స్ వైరల్..

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ” సైంధవ్ ” నుంచి నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాని యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది. ఇతర పాత్రల్లో నవాజుద్దీన్ సిద్ధిఖి, రుహాణి శర్మ, యాండ్రియా, ఆర్య, జయప్రకాశ్, ముకేశ్ రుషి తదితరులు నటిస్తున్నారు.

కాగా యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో నిన్న రిలీజ్ అయిన సైంధవ్ టీజర్ వెంకటేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నిన్న జరిగిన ఈ టీజర్ ఈవెంట్లో వెంకటేష్ పాల్గొని సందడి చేశారు ఈ నేపథ్యంలో వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీం మొత్తం ఎంతో శ్రమించామని అన్నారు. అలాగే తప్పకుండా రిలీజ్ తర్వాత అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఇక తన కెరీర్ లో మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చేయాలనుకుంటున్నానని, యంగ్ డైరెక్టర్స్‌ ఎవరైనా అటువంటి కథతో వస్తే తప్పకుండా చేయడానికి తను రెడీ అని చెప్పారు వెంకటేష్. ఇక సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆడియన్స్ ముందుకు రానుంది.