మహేష్ బాబు పుణ్యమా అని భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ పెంచేసిన మీనాక్షి చౌదరి..!!

టాలీవుడ్‌లో ప్రెజెంట్ మీనాక్షి చౌదరి పేరు మారుమోగిపోతుంది. ఇచ్చ‌ట వాహనాలు నిలప‌రాదు. ఖిలాడీ, హిట్టు 2 సినిమాలలో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. కానీ పూజా హెగ్డే తప్పుకోవడంతో అనుకోకుండా గుంటూరు కారంలో మహేష్ బాబు పక్కన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె టైం మారిపోయింది. ప‌లు సినిమాల‌లో నటించే అవకాశాలు కూడా అందుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది. ఏకంగా కోటిన్నర డిమాండ్ చేస్తుందని టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పరుశురాం డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమాలో కూడా మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా నటించబోతుందట.

కథ ప్రకారం చాలా బోల్డ్‌గా ఈమ్యూటి సినిమాలో కనిపించబోతుందట‌. విజ‌య్‌తో లిప్ లాక్ కూడా ఉంటుందని సమాచారం. ఇక విజయ్ దేవరకొండ తో అలాంటి బోల్డ్ సీన్స్ అంటే ఈమె మరో రేంజ్‌కి వెళ్ళిపోయినట్లే. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న గుంటూరు కారం సినిమా సక్సెస్ అందుకుంటే ఈమెకు మరిన్ని సినిమా అవకాశాలు క్యూ కడతాయి అనడంలో సందేహం లేదు.