పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు… వర్మపై నటి గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు. కానీ సక్సెస్ మాత్రం కొంతమందికే దక్కుతుంది. కొందరు సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తామంటూ చాలామంది వాళ్లను మోసం చేస్తుంటారు. ప్రముఖ నటి గాయత్రి గుప్తా కూడా తనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాడుకుని వదిలేసాడని సంచలన కామెంట్లు చేసింది.

” వర్మ నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడు. ఇక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తానని ఆ తర్వాత ” ఐస్ క్రీమ్ 2 ” లో ఆఫర్ ఇచ్చాడు. ఎలాంటి గుర్తింపు రాలేదు. తర్వాత నన్ను పెద్దగా పట్టించుకోలేదు. నాకు పరిచయమైన కొత్తలో నాతో సన్నిహితంగా ఉండేవాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.

అందుకే ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి ” అని సూచించింది. ప్రస్తుతం గాయత్రి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసి కూడా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్లావు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రామ్ గోపాల్ వర్మని దారుణంగా తిడుతూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.ఈమెకి వివాహం కూడా అయ్యింది. కానీ అనుకోని కారణాలవల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈమె బోల్డ్ పిక్స్ తో ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం వల్లే ఈమెకు తన భర్త విడాకులు ఇచ్చేసాడని గతంలో వార్తలు కూడా వినిపించాయి.