రాననుకున్నారా? రాలేను అనుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్..!!

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0 ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్‌తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్‌బాస్ రోజుకో షాక్ ఇస్తు ఆటను మరింత రసవక్తరంగా మారుస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ ఎలిమినేట్ కావచ్చు అని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. శుభశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. గౌతమ్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపి బిగ్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. తాజాగా జరిగిన ఎపిసోడ్‌ గురించి చూద్దాం.

బయటకు వస్తూనే గౌతం మాట్లాడుతూ..” రాననుకున్నారా.. రాలేను అనుకున్నారా? అంటూ సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ ఎంతో ఆవేశంగా బయటకు వచ్చాడు. అశ్వద్ధామ ఇస్ బ్యాక్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ” తేనె పూసిన కత్తిని గొంతులో దింపారు కదా.. అయినా ఈ అశ్వద్ధామ చావడు. ఎలా వెళ్లానో అలానే వచ్చా. దిస్ ఇజ్ 2.0 బేబీ ” అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ మాటలు చూసి కంటిస్టెంట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత శివాజీని ఉద్దేశించి మాట్లాడాడు. అన్నా మీరు నన్ను ఎంటర్టైన్ చేయలేనని అన్నారు కదా? అని గౌతమ్ చెప్పడంతో.. తమ్ముడు ముందు నీ రీజ‌న్ చెప్పు అంటూ శివాజీ అన్నారు. ” ఎంటర్టైన్ చేయడం అంటే ప్యాంట్ తీసి తిరగడం కాదు కదా.. కవర్ను చూసి బుక్ ను అంచనా వేయకూడదు అన్నా ” అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు.

ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ..” బట్టలిప్పడం ఎంటర్టైన్మెంటా అని ఇంతమంది ముందు అన్నావ్. 100 సినిమాల్లో చేశా బట్టలు లేకుండా. నేను ఒక నటుడిని.. ఏమైనా చేస్తా ” అని శివాజీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ వెంటనే గౌతమ్ మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను.. దీన్ని ఉపయోగించి నువ్వు ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు లేదా ఒకరిని సేవ్ చేయొచ్చు అని అనౌన్స్ చేశారు బిగ్ బాస్. దీంతో గౌతమ్ ఎవరిని ఎలిమినేట్ చేయకుండా సందీప్ ని సేవ్ చేశాడు. ఈవారం ఎలిమినేషన్ లో ఉన్నవారు అశ్విని, నయని, పూజ, తేజ, అమర్, శోభ శెట్టి, ప్రిన్స్, ఉన్నారు.