ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అక్క చెల్లెలు గుర్తుపట్టారా..? ఒకప్పుడు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఒకరు స్టార్ హీరోయిన్గా రాణిస్తే మరొకరు హీరోయిన్గా సక్సస్ కాలేదు. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులేసి అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడి 51 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలారు. ఇంతకీ వీళ్ళు ఎవరో గుర్తుపట్టారా..? బాలీవుడ్ బ్యూటీస్ డింపుల్ కపాడియా, సింపుల్ కపాడియా.
మొదటి సినిమాతోనే డింపుల్ కపాడియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. బాలీవుడ్లో అడుగుపెట్టిన డింపుల్ స్టార్ హీరో రిషి కపూర్ సరసన నటించిన ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. బాలీవుడ్ హీరో రాజేష్ కన్నా ను వివాహం చేసుకుంది. కానీ వీరి వైవాహిక జీవితం సజావుగా సాగకపోవడంతో 9ఏళ్ళ తర్వాత వీరు విడిపోయారు. అయితే నటనను మాత్రం వదిలిపెట్టలేదు. డింపుల్ ఇప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తుంది. యాక్టింగ్ వదిలేసి ఫ్యాషన్ డిజైనింగ్పై ఫోకస్ పెట్టింది సింపుల్ కపాడియా.
మొదటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సింపుల్ సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. రాజేష్ కన్నా హీరోగా నటించిన అనురోధ్ తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ తనకు ఫ్లాప్ అవడంతో చక్ర వ్యూహం, మన్ పసంద్, లూట్ మార్ లాంటి సినిమాలు నటించింది. అయితే తనకు సంతృప్తి దక్కలేదు. దీంతో యాక్టింగ్ వదిలేసి తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఫోకస్ పెట్టింది. పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్గా వ్యవహరించింది. క్యాన్సర్ వ్యాధి ఆమె ఆరోగ్యం దెబ్బతీయడంతో అనారోగ్య కారణంగా 2009లో నవంబర్ 10న ఆమె మరణించింది.