దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్, అమెరికన్ ఎంటర్టైన్మెంట్ జెయింట్ వాల్ట్ డిస్నీలా మధ్య నగదు బదిలి, స్టాక్ కొనుగోలు ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు సమాచారం. భారత్ లోని వాల్ట్ డిస్నీ తన డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్లు నియంత్రిత వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్లు నుంచి 8 బిలియన్ డాలర్లు మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.
ఇక డిస్నీ స్టార్ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్ లు హైలెట్ చేస్తున్నాయి. చర్చల్లో భాగంగా డిస్నీ తన మైనారిటీ వాటాని అలాగే ఉంచుకుని మిగిలిన మేజర్ వాటాను నగదు బదిలి, స్టాక్స్ను కొనుగోలు చేసేలా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. డీల్పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
డిస్నీ ఆస్తులను కొంతకాలం పాటు ఉంచుకోవాలని వాల్ట్ డిస్నీ అనుకుంటుందని సమాచారం. 2022లో ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను 2.7 బిలియన్ డాలర్లకు అంబానీ సొంతం చేసుకున్నారు. జియో సినిమా ఫ్లాట్ఫారమ్ లో ఐపీఎల్ ప్రసారాన్ని ఉచితంగా యూజర్లకు అందించారు. ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్ ఫోటోలను భారత్తో ప్రచారం చేసేందుకు గాను ఆ హక్కులని రిలయన్స్ సొంతం చేసుకోవడం వంటి వరుస పరిణామాలతో వాల్ట్ డిస్నీ స్టార్ డిస్నీ ని అమ్మేలా నిశ్చయించుకుంది.