ఇండస్ట్రీలోకి రాకముందు సమంత అలాంటి పని చేసిందా… కేవలం రూ.5 వేల కోసం (వీడియో)

ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న నటులు ఒకప్పుడు చిన్నచిన్న యార్డ్స్ చేసి పైకి వచ్చినవాళ్లు. అలాంటి వారిలో మన సమంత ఒకరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి సమంత కేరళ రాష్ట్రంలో పుట్టి.. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా చెన్నైలో స్థిరపడాల్సి వచ్చింది.

ఇక ఆమె చదువుకున్న రోజుల్లో నటన మీద ఇష్టంతో కాలేజీలో పలు కల్చరల్ ఆక్టివిటీస్ లో పాల్గొనేదట. దీంతో ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టకముందు.. ఓ వాణిజ్య ప్రకటనలో చేసే అవకాశం వచ్చింది. తమిళనాడుకు చెందిన ఆషిక జువెలరీకి సంబంధించిన వస్తువులను ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది సమంత. ఆమె మొట్టమొదటి స్క్రీన్ పై కనిపించింది ఆ యాడ్ తోనే.

ఈ యాడ్ కు సమంతా కు అప్పట్లో రూ. 5 వేలు పారితోషకం ఇచ్చారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతని గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంది అని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. అంతా హార్డ్ వర్క్ చేసింది కాబట్టే ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.