యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. గోపీచంద్ తో శ్రీను వైట్ల చేస్తున్న కథ పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో సాగుతుందని.. మెయిన్ కథాంశమే నీరు చుట్టూ ఉంటుందని టాక్.
మొత్తానికి గోపీచంద్, శ్రీను వైట్ల నుంచి పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అలాగే శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఫుల్ గా ఉన్నాయట. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాతో ఈ ఐటెం సాంగ్ని చేయిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు.
ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ సంస్థ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వేణు దోనేపూడి ప్రతిష్టాత్మంకంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు ప్రకటించాల్సి ఉంది. అన్నట్లు ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ని యూనిట్ పరిశీలిస్తున్నారట. స్క్రిప్ట్ కి తగ్గట్టుగా ఈ టైటిల్ సరిపోతుందని భావిస్తున్నారట.