” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాకి షాకింగ్ బుకింగ్స్..!!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించని స్థాయిలో జరగడం లేదని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ సినిమాకి గంటకి 400 టికెట్లు అమ్ముడు అవుతున్నాయి.

చెప్పాలంటే ఈ సినిమాపై ఇప్పటి వరకున్న అంచనాలకు ఇది చాలా తక్కువ. ఎందుకంటే మన మాస్ హీరో మూవీస్ అంటే థియేటర్ దగ్గర అమ్ముడుపోయే టికెట్స్ ఎక్కువే. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేకపోవచ్చు కానీ మంచి టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.