బిగ్ బ్రేకింగ్ : కారు ప్రమాదంలో గాయపడిన స్టార్ బ్యూటీ..!!

= ఒబెరాయ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. ఇటీవల వీరు విహారయాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సూపర్ కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్గినీ కార్ మరో లగ్జరీ కార్ ఫెరారీని క్యాంపర్ వ్యాన్ ని ఢీకొట్టింది. లాంబోర్ఘిని, ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు మినీ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ప్ర‌మాదం జరిగింది. దీంతో ఫెరారీ కార్లో ఉన్న స్విట్జర్లాండ్ కు చెందిన ఓ ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ మీడియా నివేదికల ప్రకారం ఫెరారీలో మంటలు చెలరేగడం మెలిస్సా క్రౌడ్లీ(63) మార్కస్కౌట్లీ (67) దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం గాయత్రీ వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారట‌.

మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించిన గాయత్రీ జోష్ వీడియో జాకీగా తన కెరీర్‌ ప్రారంభించి అడ్వర్టైజింగ్ మోడల్ గా పనిచేసింది. తర్వాత పలు బాలీవుడ్ మ్యూజిక్ వీడియోలో కూడా మెప్పించింది. ఆ తర్వాత సెమినా ఇండియన్ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన గాయత్రి 2000లో ఫిమేనా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ అందుకుంది. ఇక 2004లో అశుతోష్ గోవారిక‌ర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ స్వేడ్స్‌లో నటించింది. 2005లో వ్యాపారవేత వికాస్ ఒబేరాయిని వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.