నాగార్జున కారణంగా.. కెరీర్ స్టార్టింగ్ లోనే ఆ హిట్ సినిమాను వదులుకున్న నాగచైతన్య..!!

అక్కినేని నాగార్జున నట వారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న నాగచైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్క బ్లాక్ పాస్టర్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. ఇక‌ చైతన్య సినీ కెరియర్ కాదు పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతను వివాహం చేసుకున్న నాగచైతన్య ఏవో మనస్పర్ధలతో ఆమెకు విడాకులు ఇచ్చేసాడు.

తరువాత ఆయన నటించిన సినిమాలు ఏవి హిట్ కాకపోవడంతో నాగచైతన్య సమంతకు అన్యాయం చేయడం వల్ల నీకు ఈ గతి పట్టింది. అందుకే నీ సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అంటూ పలు రకాలుగా నెగటివ్ ట్రోల్స్‌కి గుర్యాడు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్లో 2009లో వచ్చిన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన చైతు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. చైతు వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్న రోజుల్లో ఆయన వద్దకు మొదట కొత్త బంగారులోకం సినిమా అవకాశం వళ్ళిందట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఈ సినిమా తో నాగచైతన్యను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నాడట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఈ క్రమంలోనే దిల్ రాజు ద్వారా చైతన్య‌కి కదా వినిపించాడట. కానీ నాగచైతన్యకు ఈ స్టోరీ సెట్ కాదేమో అనే ఉద్దేశంతో నాగార్జున ఆ కథను వ‌ద్ద‌ని రిజెక్ట్ చేసాడట. లేదంటే ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకునేవాడు. కాగా పెదకాపు ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరించాడు.