తన నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్స్ ను వెల్లడించిన బేబీ ప్రొడ్యూసర్…!!

నిర్మాత ఎస్కేఎన్ ప్రస్తుతం తన చివరి మూవీ అయిన బేబీ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్నారు. బేబీ సినిమా లో బడ్జెట్ లో వచ్చి ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికీ తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాతో ఈ ముగ్గురి జీవితమే మారిపోయిందని చెప్పొచ్చు.

ఇక ఇటీవల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో SKN తన రాబోయే ప్రాజెక్టుల కోసం దర్శకుల పేర్లను వెల్లడించాడు. బేబీ దర్శకుడు సాయి రాజేష్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.మిగిలిన ముగ్గురు దర్శకులు సందీప్ రాజ్, సుమన్ పాతూరి మరియు రవి నంబూరి. ఎస్కేఎన్ ఈ దర్శకులతో కలిసి పోజులిచ్చిన ఫోటోను కూడా పంచుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌లకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.