వెంకటేష్ – నాగ చైతన్య కాంబోలో వెంకి మామ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రేమమ్ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి మెప్పించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దగ్గుపాటి, అక్కినేని అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చిన సినిమాల్లో ఈ సినిమాలు కూడా ఉన్నాయి. మళ్లీ ఈ కాంబోలో సినిమా రావాలని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. వారి కోరిక త్వరలోనే నెరవేరబోతుందట.
ఎస్ వెంకీ – చైతూలను మళ్లీ స్క్రీన్పై చూడవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇటీవల వెంకీని కలిసి స్టోరీని చెప్పాడట. ఈ సినిమా వెంకటేష్కి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ప్రకారం ఓ యంగ్ హీరోకి స్కోప్ ఉంది. దీనికోసం నాగచైతన్య అయితే పర్ఫెక్ట్ గా ఉంటాడని మూవీ టీం భావిస్తున్నారట. చైతన్య కూడా కథను విని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చైతు – చందు మొండేటి డైరెక్షన్లో ఓ బిగ్ బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడు.
మరోపక్క వెంకటేష్ కూడా సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమా షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత.. 2024లో వెంకీ – చైతన్య కాంబో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమాకు భూపతి రాజు కథను అందిస్తుండగా.. సురేందర్ రెడ్డి తన స్టైల్ లో కథను మార్చి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వక్కంతం వంశీ కూడా ఈ సినిమా డైలాగ్ వర్షన్ కోసం రంగంలోకి దిగుతున్నాడు. మరి ఈ సినిమా కూడా వెంకీ మామ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.