మత్తెక్కించే చూపులతో ఐశ్వర్య రాజేష్.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ‘ కౌసల్య కృష్ణమూర్తి ‘, ‘ మిస్ మ్యాచ్ ‘, వరల్డ్ ఫేమస్ లవర్, టక్‌ జగదీష్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం త‌మిళ్, మలయాళ సినిమాల్లో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తమిళ్‌లో రెండు సినిమాలు మలయాళం లో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

ఈ నేపథ్యంలో ట్రెడిషనల్ వేర్ తో గ్లామర్ అందాలు వ‌లకబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది. హాట్ ఫోటో షూట్ లకు దూరంగా ఉండే ఐశ్వర్య రాజేష్ ఎప్పటికప్పుడు కొత్త లుక్ తో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. అదిరిపోయే ఔట్‌ఫిట్‌తో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. ఏ ఫంక్షన్ లో అయినా ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ ఇటీవల మరో కొత్త గ్లామర్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్‌గా కొన్ని ట్రెండీ ఫోటోలను పంచుకుంది.

క్లోజప్ షాట్‌లో టాప్ యాంగిల్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. కిర్రాక్ స్టిల్స్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మ మత్తు కళ్ళతో కుర్రాళ్ళకి నిషా తెప్పించే విధంగా స్టిల్స్ ఇచ్చింది. మరోవైపు షోల్డర్ అందాలతో కుర్రాళ‌ని మైమరిపించింది. ఇక రూప సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలకు అభిమానులు ఫీదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.