ఏడాది 4 నెలల తరువాత.. మళ్లీ మంచి రోజులు వచ్చాయి.. చాలా సంతోషంగా ఉన్నాను… సమంత..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకుంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక‌ సమంత, నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

గతవారం రోజుల నుంచి సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లపై సామ్ నేరుగా స్పందించకుండా చైతు గుర్తుగా ఉన్న టాటూ చెరిపేసా అన్నట్లు ఓ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.. రూమర్స్ కు చెక్ పెట్టింది. కాగా సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని ఆహార అలవాట్లకు దూరంగా ఉంటుంది.

అయితే సామ్ తాజాగా…” ఏడాది 4 నెలల తర్వాత బ్రెడ్ తిన్నాను. చాలా హ్యాపీగా ఉంది ” అని ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టింది. ఎలాంటి మసాలాలు లేకుండా.. ఎగ్ లేకుండా.. కెమికల్స్ లేకుండా ఉన్న బ్రెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో లు నెట్టింట వైరల్ గా మారాయి. కొందరు సమంత పరిస్థితిని చూసి జాలి పడుతున్నారు.. ఆమె ఏం చేసిన త‌ప్పు ప‌ట్టే మరి కొందరు నెట్టిజ‌న్‌లు నీకు తగిన శాస్తి జరిగింది అంటూ ఇక్కడ కూడా ఆమెపై నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు..!!