నటి గాయత్రి గుప్తా ఫిదా సినిమాతో సాయి పల్లవి ఫ్రెండ్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఐస్ క్రీమ్ 2, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోనీ, కొబ్బరి మట్ట లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినీ ప్రపంచం అంటేనే రంగులు ప్రపంచం అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెరపై కనిపించిన నవ్వులు ఆనందాలు చాలామంది నటీనటుల నిజ జీవితాలలో కనిపించవు. అదేవిధంగా గాయత్రి గుప్త జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలా కాలంగా ఆర్థసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ జబ్బుతో పోరాడుతున్నట్టు గతంలోనే ఏమే ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
అయితే డిప్రెషన్ కారణంగా వచ్చే ఈ మానసిక వ్యాధి తీవ్రత ఇటీవల పెరగడంతో ఆమె తక్షణ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారట. దీనికి 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆమె ట్రీట్మెంట్ చేయించుకోవడానికి తగిన డబ్బు ప్రస్తుతం ఆమె దగ్గర లేవని సమాచారం. ఆమె ట్రీట్మెంట్ కు కావలసిన డబ్బులను స్వీకరించేందుకు ఇంపాక్ట్ గురూ అనే స్వచ్ఛంద సంస్థ విరాళాల సేకరణకు ముందుకు వచ్చింది. ఆమె వైద్యానికి 12 లక్షల ఖర్చు అవుతుండగా ఇప్పటికీ ఆమెకు కేవలం రూ.1.5 లక్షల విరాళాలు మాత్రమే వచ్చాయట. ఆమెకు ఇంకా రూ.10 లక్షలకు పైగా డబ్బు కావాల్సి ఉంది. ఈ మేరకు గాయత్రి గుప్తకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తన వంతు సాయం చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా త్వరగా కోలుకోవాలని ఆమెకు భరోసా కల్పించాడు. గాయత్రీ కి దాతలు సహాయం చేయాలని ఆయన కోరాడు. ఇక నా ఆరోగ్య పరిస్థితి మరింత ప్రమాదంగా మారింది దీంతో తక్షణమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇది నా జీవితంలో చాలా కష్ట సమయం నా వైద్యానికి అవసరమయ్యే డబ్బు నా దగ్గర లేదు దయచేసి నాకు సహాయం చేయండి.. ఇంపాక్ట్ గురు డాట్ కామ్ అనే ఫండింగ్ సంస్థ ద్వారా నాకు సహాయం అందించండి.. మీకు తోచినంత మొత్తాన్ని నా వైద్య ఖర్చులకు ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ గాయత్రి గుప్తా ట్విట్ చేసింది. ప్రస్తుతం గాయత్రి గుప్తాకు సంబంధించిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.