వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వ‌స్థ‌త‌… హైద‌రాబాద్ కిమ్స్‌కు త‌ర‌లింపు..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. పి గన్నవరం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కొంతసేపటి క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అత‌ను హైదరాబాద్ కిమ్స్ హాస్పటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొలినేని హాస్పటల్లో జాయిన్ చేశారు.

అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేసి చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డ కట్టిందని గుర్తించారు. వెంటనే అత్యవసర ప‌రిస్థితిలో అంబులెన్స్‌లో హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని.. టెన్ష‌న్ ప‌డాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెప్పినట్లు ఎమ్మెల్యే కొడుకు వికాస్ తెలిపాడు.