ఖుషి సినిమాపై నెగ‌టివ్ టార్గెట్ చేస్తోందెవ‌రు… ఈ కుట్ర ప్లాన్ ఎవ‌రిదంటే..!

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఖుషి సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. మొదటి 3 రోజులు భారీ కలెక్షన్స్ వశుళ్ళు చేసి విజయ్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. కుర్రకారుకే కాక ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. ఇక ఈ సంగతి అలా ఉంచితే.. ఈ సినిమా మీద నెగటివ్ టాక్ కూడా వస్తున్న సంగతి సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి తెలిసే ఉంటుంది.

ఈ సినిమాపై ఇంత నెగిటివ్ టాక్స్ రావ‌టానికి పట్టిక్యులర్‌గా ఒక హీరో ఫ్యాన్స్ కారణమట‌. వారు కావాలనే ఫేక్ రివ్యూ ఇస్తూ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని విజయ్ దేవరకొండ అభిమానుల వాదన. ఇందుకు ఉదాహరణగా మాట్లాడుతూ ప్ర‌ముఖ‌ టికెట్‌ బుకింగ్ యాప్ బుక్ మై షో లో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా బాలేదంటూ చెబుతూ వన్ బై వన్ రేటింగ్స్ దాదాపు ఒక పదివేల మంది నమోదు చేశారని.. అయితే అవి జెన్యూన్‌గా నమోదు చేసినవి కాదంటూ బ్యాట్స్.. అంటే ఆటోమేటిక్‌గా సిస్టం ద్వారా మానిప్లేట్ చేస్తూ ఇలా తప్పుడు రేటింగ్స్ ఇచ్చార‌ని దేవరకొండ అభిమానులు భావిస్తున్నారు.

నిజంగా పబ్లిక్ సినిమా చూసి వారికి నచ్చకపోతే ఇలాంటి రేటింగ్ ఇస్తే పర్వాలేదు కానీ కావాలని ఇలా పని కట్టుకొని కొందరు నెగిటివ్గా రేటింగ్స్ ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేశారు. దీని వెనక ఉన్న ఆ ప్రముఖ హీరో టీమ్‌ ఎవరు అనేదాన్ని మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు. నిజంగానే బుక్ మై షో లో ఇలా ఫేక్ రేటింగ్ జరిగి ఉంటే అది కూడా పదివేల ఫేక్ రేటింగ్స్ కనుక ఉండడం నిజమైతే దీని వెనుక‌ వెనుక నిజంగానే ఎవరో పెద్ద ఎత్తున కుట్ర చేసినట్లు భావించవచ్చు.