మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి – జ‌వాన్ రెండు సినిమాలు ఓకే చోట చూడండి…!

అనుష్క చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించింది. నవీన్ పోలిశెట్టి జంటగా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఈ సినిమా రిలీజై ఆడియోన్స్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పి.మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాజర్, మురళీ శర్మ, జై సుధా, అభినయ‌ గోమఠం, సోనియా దీప్తి లాంటి చాలామంది ప్రముఖులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చూడాలని ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది.

కానీ ఈ సినిమాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు జవాన్ సినిమా రంగంలోకి దిగింది. అదే రోజున జవాన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో ఈ సినిమా రావడం, లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార హీరోయిన్గా ప‌రిచ‌యం, క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా, దీపికా పదుకొనే గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌టం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది.

ఈ సినిమా కూడా నిన్ననే విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ తో డీల్ ఫిక్స్ చేసుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ లో రూ120 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి మరీ జవాన్ సినిమాని సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. కాగా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సాధారణంగా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు నెలలోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.

ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే మరో వారం రెండు వారాలు పోస్ట్ పోన్ అవుతుంది. అదే సినిమా ప్లాప్ అయితే అదే నెలలో ఓటిటిలో ప్రత్యక్షమవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ రెండు సినిమాలు ఫలితాన్ని బట్టి ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్ కాబోతోంది. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి అయితే సెప్టెంబర్ చివ‌రిలో లేదా అక్టోబర్ నెల స్టార్టింగ్ లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక జవాన్ మాత్రం అక్టోబర్ చివర్లో రిలీజ్ అవ్వ బోతున్నట్లు తెలుస్తుంది.