వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. క్రికెట్ ధర చూస్తే దిమ్మ తిరుగుతుంది….!!

ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.
దాయాదుల మధ్య పోరు ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. అటువంటిది ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో భారత్, పాక్ తెలపడం ఉండడంతో ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు. ఇప్పటికే ఆసియా కప్ లీగ్ దశలో భారత్, పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. సూపర్ 4 లో మరోసారి ఈ ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీ తరువాత భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో దాయాదుల పోరు జరగనుంది. ఈ మెగా టోర్మీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థిలు భారత్, పాక్ తెల్పడనున్నాయి.

 

టికెట్ ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే:
2019 తర్వాత వన్డే ప్రపంచ కప్ లో దాయాదుల పోరు జరగనుండడంతో మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యక్షంగా మ్యాచులు చూడాలనుకున్న అభిమానులు టిక్కెట్ల కోసం మాత్రం తమ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అవును మీరు విన్నది నిజమే. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ వల్ల టికెట్ ధరలు ఆకాశానికి ఉంటాయి. ఒక్కో టికెట్ ధర అత్యధికంగా రూ. 57 లక్షలు పలుకుతుంది.

వాస్తవానికి బీసీసీఐ అధికారికంగా ఈ మ్యాచ్ టికెట్లను ఆగస్టు 29, సెప్టెంబర్ 3 తేదీల్లో బుక్ మై షో లో అమ్మకాలకు ఉంచింది. బుకింగ్ ఓపెన్ చేసిన గంటలో పే’ సోల్డ్ అవుట్ ‘ బోర్డు కనిపించింది. దీన్ని సెకండరీ మార్కెట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్ స్పోర్ట్స్ టికెట్ ఎక్స్ంజ్, రీసెల్ వెబ్సైట్ అయినా వయాగోగో తమకు నచ్చిన విధంగా ధరలు నిర్ణయించి నిక్రయిస్తోంది. వయాగోగో టికెట్ రేటు ప్రకారం.. నరేంద్ర మోడీ స్టేడియంలో గల ఆప్పర్ టైర్ రేట్లు రూ. 57 లక్షలు గా ఉంది. అవి కూడా రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

అదే విధంగా సౌత్ ప్రీమియమ్ వెస్ట్ బే టికెట్ రేటె రూ. 19.5 లక్షలు గా ఉంది. ఈ టిక్కెట్ల ధరకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి‌. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..’ అసలు ఏం జరుగుతుంది? వయగోగో వెబ్ సైట్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు 65,000 నుంచి 4.5 లక్షణ వరకు ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు నిలువ దోపిడీకి పాల్పడుతున్నాయి అంటూ ఎక్స్ ( ట్విట్టర్) లో కామెంట్ చేశాడు.