టాలీవుడ్‌లో త‌ర్వాత చ‌నిపోయే న‌టి ఆమే.. వేణుస్వామీ కామెంట్స్ వైర‌ల్..!

ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సినీ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు విడాకులు జాతకాల గురించి జోష్యం చెప్తూ ఫేమస్ అయిన వేణు స్వామి.. చెప్పింది చెప్పినట్లు జరగడంతో సెలబ్రిటీలు సైతం వేణు స్వామి మాటలను నమ్మి ఇళ్లలో పూజలు యాగాలు చేయించుకున్నారు. ఇప్పటికే రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ ఇలాంటి హీరోయిన్స్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరపడం చూసాం.

 

ఇక ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు అనారోగ్యం బారిన పడిపోతున్నారు. రీసెంట్‌గా టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చావు బతుకులతో పోరాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వేణుస్వామి మాట్లాడుతూ ఇండస్ట్రీలో నెక్స్ట్ చనిపోయే అమ్మాయి 40 సంవత్సరాల లోపు ఉండే హీరోయిన్ అంటూ పెద్ద బాంబు పేల్చాడు.

దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వేణు స్వామి మాట్లాడేది సమంత గురించేనా అంటూ ఆలోచనలో పడ్డారు. సమంత ఫ్యాన్స్ ఈ విషయంలో ఆందోళ‌ణ చెందుతున్నారు. వేణుస్వామీ చెప్పింది ఆమె గురించి కాకుడ‌దంటు దేవుడిని కోరుకుంటున్నారు.