టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్లో నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు.
దీని తరువాత బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్, బాలీవుడ్ లో భారీ హైప్ నెలకొంది.
ఈ మూవీని నవంబర్లో సెట్స్ పైకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. 2025 రిపబ్లిక్ డే కానుకగా సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లు లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ థ్రిల్లర్గా యువ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తారు.