టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట బాధాకర సంఘటన చోటు చేసుకుంది. ఆయన ఎంతో కాలం నుంచి ప్రేమగా పెంచుకుంటున్న ఆవు చనిపోయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. నేను మొదటిసారి ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది.. చాలా బాధగా అనిపిస్తుంది. మేము దాన్ని మా కుటుంబ సభ్యురాలుగా చూసుకున్నాము. 13 ఏళ్లుగా దాన్ని ప్రేమగా పెంచాము. నా కూతురైతే ఆ అవును ఎంతో ప్రేమగా లక్ష్మీ అని పిలుచుకుంటుంది.
ఇప్పుడు ఆ ఆవు చనిపోయింది అంటూ ట్విటర్లో దాని ఫోటో షేర్ చేశాడు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారింది. ఇక నీకోసం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీను వైట్ల తర్వాత ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, భాష లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలను రూపొందించాడు. అయితే గత కొంత కాలంగా అతడికి ఇండస్ట్రీలో అసలు కలిసి రావడం లేదు. 2014 నుంచి అతను నాలుగు సినిమాలే చేయగా అవేవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకోలేకపోయాయి.
2018లో అమర్ అక్బర్ ఆంటోనీ తీసిన ఈ సినిమా ఫ్లాప్ అవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవలే మ్యాచ్ స్టార్ గోపీచంద్తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా సక్సెస్ ప్రస్తుతం చాలా అవసరం. ఇక ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే వీరిద్దరి కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది.