“టైగర్ నాగేశ్వరరావు” ట్రైలర్ లాంచ్.. అభిమానులకే నిర్న‌యం వదిలేసిన నిర్మాతలు.. (ట్వీట్)

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, నపూర్ సనన్ హీరోయిన్ గా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ” టైగర్ నాగేశ్వరరావు “. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అంతకంతకు హైప్ ని పెంచుకుంటూ పోతుంది.

ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ టీజర్, సాంగ్స్ అదరగొట్టగా… టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు, మరి ఈ అవైటెడ్ ట్రైలర్ పై అయితే చాన్స్ ఫ్యాన్స్ కే వదిలేశారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. తన ట్విట్టర్ ద్వారా రెండు డేట్స్ పెట్టి ఏ డేట్ నా టీజర్ కావాలి అనుకుంటున్నారని పోల్ ద్వారా అడగ్గా… ఎక్కువమంది అయితే ఈ సెప్టెంబర్ 27 కే వోట్ వేశారు.

దీంతో ఇదే సరైన సమయం అని అప్పుడు వచ్చే అన్ని సినిమాలతో ట్రైలర్ ని అటాచ్ చేసి రిలీజ్ చేస్తే పాన్ ఇండియా వైడ్ సినిమాకి మరింత బూస్టప్ వస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి మేకర్స్ అదే డేట్ లో ఫ్యాన్స్ రెస్పాన్స్ ని గౌరవించి రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.