టాలీవుడ్ లో ఎవరు చనిపోయిన నాగార్జున చూడడానికి వెళ్లక పోవడానికి కారణం ఇదే..!!

అక్కినేని సినీ బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అక్కినేని నాగార్జున. టాలీవుడ్ లో నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాలు దాటిన ఇంకా నవమన్మధుడు లాగా నాగార్జున తన యంగ్ లుక్ ను కొనసాగిస్తున్నాడు. నాగార్జున నటి వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇద్దరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కొడుకులకు పోటీగా సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఎప్పుడూ పరపతిని ఉపయోగించకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదిగాడు.

ఇదిలా ఉంటే నాగార్జున ఏ సెలబ్రిటీ చనిపోయిన చూడడానికి వెళ్లడు. కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా నాగార్జున వెళ్లకపోవడంతో మీడియా సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ వినిపించాయి ఆయన కుటుంబంలో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూసిన ఆయన సతీమణి అన్నపూర్ణ కళ్ళు మూసిన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లారు అయితే నాగార్జున మాత్రం సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు వెళ్లకపోవడానికి కారణాలేంటో తెలియదు గానీ ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కేవలం నాగార్జున ఎవరైనా సెలబ్రిటీ చనిపోయినప్పుడు వెళ్ళాడు అంటే అది దాసరి నారాయణ భార్య చనిపోయినప్పుడు మాత్రమే. అది కూడా అమె చనిపోయిన మూడో రోజున అటుగా వెళుతూ దాసరిని పరామర్శించాడు. నాగార్జునకు సంబంధించిన సినిమా ఒకటి ఆగిపోవడం వల్లనే అటే వెళ్లే దారిలో కలిసి పనిలో పనిగా పరామర్శించి వెళ్ళాడు. అయితే నాగార్జునకు తన పనులు తప్ప ఇంకా ఎవరి పనులు పట్టవని.. ఏ లాభం లేకుండా ఎటువంటి పని చేయడని న్యూస్ నాగార్జున సినీవర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. దీంతో నెటిజ‌న్స్ నాగ్ పై ఫైర్ అవుతున్నారు.