గణపతిని ప్రతిష్టిమ‌చాడానికి.. శుభ ఘడియలు ఇవే….!!

వినాయక చవితి పండగకు పట్నంలోని జనాలే కాకుండా పొలాల్లో ఉండే జనాలు సైతం ఫుల్ ఖుషి అవుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాలనీలన్నీ గణేశుని విగ్రహాలతో నిండిపోతాయి. ప్రతి ఏటా వినాయక చవితి ఎంతో నిష్టగా జరుపుకుంటారు. ఈసారి గణపతి పండగ 18,19 తేదీల్లో వచ్చింది. రెండు రోజులు రావడంతో ఏ రోజు వినాయకుడిని తీసుకురావాలని దానిపై జనాల్లో పెద్ద గందరగోళం నెలకొంది.

పండితుల సలహా మేరకు 18న పండగ ప్రారంభం కానుంది. అయితే ఏదైనా పండగ చేసుకోవాలంటే ఆ పండగకు సంబంధించిన శుభ ఘడియలు ఉన్న సమయంలోనే జరుపుకోవాలని పండితులు కూడా చెబుతున్నారు. వినాయకుడిని శుభ ఘడియల్లో ఇంటికి తీసుకొస్తే సంతోషం, శ్రేయస్సు కలిగి జీవితంలో కలిగే ఇబ్బందులు, బాధలు అన్నీ తొలగిపోతాయట. గణపతి ని ఇంటికి ఏ సమయంలో తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 18న (రేపు) ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు మంచి ముహూర్తం ఉంది.

మళ్లీ మధ్యాహ్నం 12:39 నుంచి మరుసటి రోజు 19 రాత్రి 8:43 వరకు ఉంది. ఈ గడియల్లో వినాయకుడిని ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్టించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో గణపతిని పెట్టే స్థలం శుభ్రం చేసుకోవాలని.. ఆ తర్వాత ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని వేయాలని. దీనిపై గంగా జలాన్ని చల్లి… గణపతి విగ్రహానికి పసుపు, బియ్యం, చందనం, మౌళి, మోదకం, పండ్లు, పువ్వులు సమర్పించుకోవాలని పేర్కొన్నారు.