ఈ తరం యువతకు వినాయకుడు పూజ ఎందుకు జరుపుకుంటారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రతి గ్రామంలో యువత ప్రధాన కూడళ్లు మండపాలను ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాలకు ప్రతిష్టించి పూజలు చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ అసలు వినాయక చవితి జరుపుకోవడంతో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి. నేటి యువత పూజ కంటే అక్కడ నిర్వహించే కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా యువత వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
1. వినాయక చవితిలో ప్రాధాన్యత సంతరించుకున్న పూజా ద్రవ్యాలైన 21 చెట్లు ఆకులను పూజిస్తుంటారు. వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. మానవ జీవనానికి అవసరమైనది ప్రాణ వాయువు అది చెట్లు నుంచి లభిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంతో పాటు మానవుడికి సంక్రమించే అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా చెట్లు ఆకులు ఉపయోగపడుతుంటాయి. వాటి నుంచి తయారుచేసిన ఔషధాలను తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి అనేక జబ్బులు రాకుండా కాపాడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 21 పత్రికలతో (ఆకులు) వినాయకుని పూజిస్తారు. అందుకే చెట్లు ఆకులతో పూజ చేయమని పెద్దలు చెబుతుంటారు.
2. విఘ్నేశ్వరుడి అలంకరణ ఆభరణాలుగా అనేక జీవరాసులు సృష్టిలో ఉన్నాయి, వాటి ఒక ఉద్దేశం తెలుసుకుందాం. విఘ్నేశ్వరునికి వాహనంగా ఎలుక, యజ్ఞోపవీతంగా పాము, తల భాగం ఏనుగుతో ఉంటుంది. అదేవిధంగా అతడి సోదరుడు కుమార్ స్వామికి నెమలి వాహనం. తండ్రి శివుడికి నంది వాహనంగా ఉండటం మనందరికీ తెలిసిందే. దీనిబట్టి చూసుకోవాల్సింది ఏమిటంటే.. అనేక జంతువులతో సహజీవనం చేయడం అందులోని ఆంతర్యం. పక్షులు మనకు హాని కలిగించి సూక్ల్మజీవులు, క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన రక్షణ, ప్రకృతిని అవి పరిరక్షంచడంలో జీవరాసులు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
3. గణపతి విగ్రహాన్ని చెరువులోని కొత్తగా మట్టిని సేకరించి ఈ మట్టితో వినాయక విగ్రహాన్ని తయారు చేయడంతో పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా నీటి విలువ ఉంచే విధానంతో పాటు నీటి పరిశుభ్రత గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. వినాయక విగ్రహం నిమజ్జనం ఎందుకు చేయాలని సందేహం రావొచ్చు. చెరువులు, బావులు, నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సవ్యసాధారణం. అయితే ఆ నీటిని శుభ్రం చేసేది ప్రతిష్టించిన గణపతితోపాటు ఉన్న 21 ఆకులతో కూడా పత్రి వేస్తారు. అందువలనే విగ్రహంతో పాటు పత్రిలను కూడా నిమజ్జనం చేస్తారు. దీంతో జీవరాశులకు పశు పక్లాదులకు , మానవ జీవనానికి ఆధారభూతమైన నీటిని శుభ్రపరచడంలో పత్రి ఎంతగానో ఉపయోగపడుతుంది.