ఆ టాలీవుడ్‌ హీరోయిన్ ఇంట్లో దొంగ‌త‌నం… న‌గ‌ల‌తో పాటు అవ‌న్నీ చోరీ…!

ఇటీవల సెలబ్రిటీస్ ఇంట‌ వరుస దొంగతనాలు వార్తలను మనం వింటూనే ఉన్నాం. తాజాగా ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ ఏసుదాస్‌ లాంటి వారు ఇళ్లలో చోరీ జరిగిన విషయం మరువకముందే మరో సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట‌ దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలించారంటూ నిరోష తేనంపేట్ పోలీస్ శాఖకు కంప్లైంట్ చేసింది. నగలు, నగదు తో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా మాయమయ్యాయి అంటూ ఫిర్యాదు చేసింది నటాషా.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట‌ దొంగతనం కేసులో ఇంటి దొంగ ఎవరో పోలీసులు పసి కట్టేశారు. ఆమె ఇంట్లో పనిమనిషి దొంగతనం చేసిందని గుర్తించారు. అలాగే యాక్టర్ శోభన ఇంటర్ దొంగతనం విషయంలో కూడా ఇదే జరిగింది ఆమె ఇంట్లో పనిమనిషి దొంగతనానికి పాల్పడింది. ఇక సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట దొంగతనంలో ఇప్పటివరకు దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఘర్షణ సినిమాలో హీరోయిన్గా నటించిన నిరోషా ఈ సినిమాతో యూత్ కు ఎంతగానో దగ్గర అయింది.

ఈ సినిమాలో ఆమె ఒక బృందావనం.. సోయగం.. అంటూ స్విమ్మింగ్ పూల్ లో హొయ‌లొలికించ్చింది. ఇప్పటికీ ఆ పాట మారుమోగిపోతూనే ఉంటుంది. సింధూరపువ్వు సినిమా కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ తర్వాత పెద్దగా సినిమాలు లేకపోవడంతో నిరోషా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె లాల్ సలాంలో రజనీకాంత్ భార్యగా నటిస్తుంద‌ట‌. ఇదే నిజం అయితే నిరోషా జాక్‌పాట్ కొట్టిన‌ట్లే.