మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఒక మనసు మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలో నటించినా కొనసాగిన ఏ ఒక్క సినిమా తనకి హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో నిహారిక హీరోయిన్గా అనుకున్నంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఇక సిసిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటి 2020లో జొన్నలగడ్డ చైతన్య నీ వివాహమాడింది.
ఆ తర్వాత చైతన్య, నిహారిక ఎవో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం నెట్ ఫ్లిక్సెల్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ని అందుకుంది. అప్పటినుంచి నిహారిక ఫోకస్ మొత్తం కెరీర్ మీదే పెట్టింది. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను సినిమా ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకుంటున్నారట.’ ఇప్పటికే భర్తను వదిలేశావ్.
మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే పరువు పోతుంది’ అని వద్దన్నారట. అంతేకాదు నిహారికతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్న.. వాళ్లే అడ్డుపడుతున్నారట. ఆ ఇద్దరు ఎవరనే విషయం బయటకు రాకపోయినా.. నిహారిక మాత్రం మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.