విశాల్‌పై మ‌న‌సులో ఇష్టం బ‌య‌ట పెట్టిన హీరోయిన్‌..!

కోలీవుడ్ సూపర్ హీరో విశాల్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విశాల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. విశాల్ ఇటీవల నటించిన సినిమా మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హై వోల్టేజ్ గ్యాంగ్ స్టర్ గా విశాల్ కనిపించబోతున్నాడు. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ గా డైరెక్టర్ ఎస్ వినోద్ కుమార్ ఈ సినిమాను రూపొందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా రిలీజ్ ను ఆపివేయాలంటూ నోటీసులు వచ్చాయని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా చివరకు వినాయక చవితి డేట్ ని ఫిక్స్ చేశారు.

ఇక రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ అభినయ మాట్లాడుతూ తన సంతోషాన్ని, భావాలను పంచుకుంది. అయితే ఈమె చెవుడు, మూగ అన్న సంగతి తెలిసిందే. ఈమె స్టేజ్ పై సైగలు చేస్తుండగా స్టేజ్ కింద నుంచి అసిస్టెంట్ ప్రోమ్ట్ తెలుగులో ఈ అర్థాన్ని వివరించింది. ఇక అభినయ మాట్లాడుతూ తన మనసులోని భావాలను ఈ విధంగా షేర్ చేసుకుంది. మార్క్ ఆంటోనీలో నాకు మంచి పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ వివరించింది.

నేను ఇందులో విశాల్ భార్యగా నటించాను.. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. నాకు విశాల్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని ఆయనతో కలిసి నటించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం అభినయ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలపై స్పందించిన అభినయ ఆ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. అయితే తన అభిమాన హీరో విశాల్ అని చెప్పడంతో మరోసారి ఈ న్యూస్ ను హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తున్నారు నేటిజెన్లు.