‘ బేబీ ‘ ప్రొడ్యూసర్ ద‌గ్గ‌ర భారీ గిఫ్ట్ కొట్టేసిన డైరెక్ట‌ర్‌.. ధ‌ర తెలిస్లే షాక్ అవుతారు..!

బేబీ సినిమా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తరికెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. జూలైలో చిన్న సినిమాగా థియేటర్లోకి రిలీజై భారి విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా ఎంతోమంది ప్రముఖ హీరోలు, సినీనటులు బేబీ సినిమాను ప్రశంసించారు. హార్ట్‌ హీటింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీ గా బేబీ సినిమా రూపొందింది.

దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఇతనికి కూడా తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో యూనిట్ సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు. ఇక సుమారు రూ.95 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది. రూ.8 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోవడం సాధారణ విషయం కాదు. ఈ నేపథ్యంలో నిర్మాత శ్రీనివాస్ కుమార్ దర్శకుడు సాయి రాజేష్ కు ఓ ఖ‌రీదైన కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ను న్యూస్ సోఫ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

నిర్మాత ఎస్‌కెఎన్ మెర్సడేస్ బెంజ్ ఏ 200 అగ్జ‌రీ కార్‌ను రాజేష్‌కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ కారు ధ‌ర సుమారు రూ.46 లక్షలు గా ఉంది. ఈ మోడల్ వైట్ కలర్ వేరియేష‌న్‌లో సాయి రాజేష్ అందుకున్నాడు. ఈ లగ్జరీ కార్‌ని ప్రొడ్యూసరే డైరెక్ట్ గా రాజేష్‌కు అందించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తంగా బేబీ సినిమాతో కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి రాజేష్ నిర్మాత ఎస్ కే ఎన్ దగ్గర భారీ బహుమతినే కొట్టేశాడు. షో రూమ్ కు తీసుకువెళ్లి మరి కారును గిఫ్ట్ చేశాడు ప్రొడ్యూసర్.