” జాతి రత్నాలు ” ఫేమ్.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇటీవల విడుదలైన తన లేటెస్ట్ ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” మూవీ ద్వారా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సీనియర్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. దీంతో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ నెట్టింట ఓ వీడియో షేర్ చేసిన నవీన్.. ప్రస్తుతం వర్జీనియాలో ఉన్నానని.. ప్రమోషన్స్ కోసం సియాటెల్కు వెళ్లినట్లు చెప్పాడు.
” ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ మాకు చాలా సంతోషాన్నిస్తోంది. ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ” అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీపై ఫ్యామిలీ తో కలిసి ఈ మూవీ చూశా.. ఫుల్ గా ఎంజాయ్ చేశా.. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ బాగుంది. అనుష్క ఎప్పట్లానే అద్భుతంగా నటించింది.
డైరెక్టర్ మహేష్, మూవీ క్రియేషన్స్, టీంకు కంగ్రాట్స్ అంటూ నటుడు మహేష్ బాబు చేసిన ట్విట్ పై నవీన్ స్పందిస్తూ…” మహేష్ బాబు ట్విట్ చూసి ఆశ్చర్యపోయా.. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న వారందరికి థాంక్స్” అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Thank you Telugu audience 🔥❤️🙏 for this blockbuster word of mouth for #MissShettyMrPolishetty. You guys make dreams come true. Feeling emotional ❤️ Here is what I am feeling right now on this tour in America. Thank you 🙏 Go watch the film with your friends and families this… pic.twitter.com/cmgusVEQAO
— Naveen Polishetty (@NaveenPolishety) September 10, 2023