సమంత- నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం ఆ దోషమేనా.. అలా చేసి ఉంటే ఇప్పటికీ వారు కలిసి ఉండేవారా..!?

టాలీవుడ్ లోనే మోస్ట్ అవెయిటేడ్ మూవీ ఖుషి ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. సమంత- విజయ్ దేవరకొండ నటనతో పాటు దర్శకుడు శివ నిర్మాణ , మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది. ఖుషి సినిమా హిట్ అయినప్పటికీ విజయ్- సమంత హ్యాపీగా లేరట. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా చూసిన వారందరూ నాడికూట దోషం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ- సమంత పాత్రలు పెళ్లి చేసుకుంటే..నాడికూట దోషం వస్తుందని హీరోయిన్ తండ్రి చెబుతాడు..ఈ నాడికూట దోషం ఉన్న వారి వివాహ జీవితం ఎక్కువ రోజులు కలిసి ఉండరని ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయని.. పిల్లలు కూడా పుట్టారని సినిమాలో చూపిస్తారు. ఇదే దోషాన్ని నాగచైతన్య- సమంతకి లింక్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. వీరికి కూడా నాడికూట దోషం ఉండే ఉంటుందని అందుకే పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకి, పిల్లల పుట్టలేదని ఇద్దరి మధ్య మనస్పార్థాలు వచ్చాయని ఫైనల్ గా విడాకులు తీసుకుని విడిపోయారంటూ పోల్చుతున్నారు.

నిజానికి హిందూ సంప్రదాయాల ప్రకారం.. నాడికూట దోషం ఉన్నవారు ఒక హోమం చేస్తారు..అలా చేయకపోతే పెళ్లి చేసుకోరు.. కానీ నాగచైతన్య- సమంత పెళ్లి విషయంలో ఇలాంటివి వారు అసలు చూసుకోలేదని.. అందుకే వారికి డైవర్స్ అయ్యాయని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ నాగచైతన్య- సమంత నాడి కూట‌ దోషం నివారణ హోమం చేస్తే కలిసి ఉండేవారు అంటున్నారు. అయితే దీనిని మరికొంతమంది అసలు పట్టించుకోవటం లేదు.

నాగచైతన్య- సమంత మాద్య‌ వచ్చిన వ్యక్తిగత సమస్యలు వల్లే విడిపోయారు.. అంతేకానీ వారికి ఎలాంటి దోషాలు లేవని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు సమంత నటించిన ఖుషి సినిమాలో నాడికూట దోషం పిల్లల పుట్టకపోవడం మనస్పర్ధలు వచ్చి విడిపోవుట వంటివి చూసిన తర్వాత నాగచైతన్య, సమంత విడాకులు విషయమే గుర్తుకు రావటం ఇక్కడ ఆశ్చర్యంగా కలిగిస్తుంది.