ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో హీరోగా నటిస్తున్న మూవీ పుష్ప 2. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై దేశవ్యాప్తంగానే కాక పలు ఇతర దేశాల ఆడియన్స్ కూడా భారీ స్థాయిలో అంచనాలను పెట్టుకున్నారు. సుకుమార్ తర్కెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీ మైత్రి మూవీ మేకర్ బ్యానర్పై నవీన్ ఆర్నేని, వై రవిశంకర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చేయడానికి సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీం చూస్తున్నారట. ఇక తాజాగా జరిగిన ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ లో భాగంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ పుష్ప 2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. దేవి మాట్లాడుతూ ఈ మూవీ పార్ట్1ని మించేలా మరింత అద్భుతంగా సుకుమార్ రూపొందిస్తున్నాడని.. ఇక ఇందులో ముఖ్యంగా వచ్చే ఓ భారీ యాక్షన్స్ సన్నివేశం ఎంతో థ్రిలింగ్గా అందరినీ ఆకట్టుకుంటుందని విఇవరించాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సాంగ్స్ కంపోజిషన్ పూర్తయిందని దేవిశ్రీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప 2ని ప్రమోట్చేస్తు దేవిశ్రీ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.